KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇన్స్టాగ్రాంలో కూడా కేసీఆర్ తన ఖాతాను తెరిచారు. ఇక నుంచి ఎక్స్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ఎక్స్ ద్వారా పంచుకోబోతారనే దాని కోసం నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాధ్యమం ద్వారా కేసీఆర్ ఒక ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎక్స్లో కేసీఆర్ను ఫాలో కావాలనుకునే వారు ఈ లింక్ను క్లిక్ చేయండి https://twitter.com/kcrbrspresident