శబరిమల, డిసెంబర్ 24: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక విపరీతంగా ఉన్నది. రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు, అయ్యప్ప మాలాధారులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్వాములు కాలినడకనే శబరిమలకు వెళ్తున్నారు. ఓ వైపు రద్దీ, మరోవైపు భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. శబరిమల సన్నిధానానికి వెళ్లే అటవీ మార్గం సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పొడిగించారు.