Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయారు. కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,412 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.92 కోట్లు.