Rahul Gandhi | దేశంలో ఇద్దరి వ్యక్తుల కోసమే అభివృద్ధి జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు ఆరోపించారు. దీంతో నాలుగు కోట్ల మంది పేదల బతుకులు ప్రశ్నార్థకంగానే మారిపోయాయని తీవ్రంగా ఆక్షేపించారు. ‘కేవలం ఇద్దరి వ్యక్తుల కోసమే దేశంలో అభివృద్ధి సాగుతోంది. కానీ నాలుగు కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారు’ అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ ఆరోపించారు. బీజేపీ ఫేయిల్ ఇండియా అన్న హ్యాష్ట్యాగ్ పేరుతో రాహుల్ ఈ ట్వీట్ చేశారు. వీరందరూ కేవలం సంఖ్యమాత్రమే కాదని, వీరంతా మనుషులని పేర్కొన్నారు. వీరందరికీ మంచి జరగాలని రాహుల్ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.