PM Modi | ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘ప్రజా శక్తి అత్యున్నతమైనది..! అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి. చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ప్రజలకు నా సెల్యూట్. మీరు అందించిన అపారమైన ఆశీర్వాదాలు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి, ఇక్కడి ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది మా గ్యారంటీ. అంతేకాదు.. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తాం’ అని మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ఈ గెలుపులో పగలు, రాత్రి కస్టపడి శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
जनशक्ति सर्वोपरि!
विकास जीता, सुशासन जीता।
दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।
दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम…
— Narendra Modi (@narendramodi) February 8, 2025
Also Read..
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Parvesh Verma | సీఎం రేసులో పర్వేశ్ వర్మ.. గెలుపు అనంతరం అమిత్ షాతో భేటీ
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా