న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం నాడు క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం 5.30-6.30 గంటల మధ్య క్యాబినెట్ విస్తరణ జరుగవచ్చునని సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలకు విస్తరణలో ప్రాధాన్యం ఇస్తారని తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే, కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) మాత్రం తమకు ఇచ్చే మంత్రి పదవులపై పేచీ పెట్టినట్లు సమాచారం. తమకు కనీసంగా నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తున్నది.
బీహార్ నుంచి 17 మంది బీజేపీ ఎంపీలు ఉంటే, ఐదుగురు మంత్రులు ఉన్నారు. జేడీయూకు 16 మంది ఎంపీలు ఉంటే ఒక్క మంత్రి కూడా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరినట్లు సమాచారం.
జేడీయూకు రెండు కేంద్ర క్యాబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు కేటాయించాలని ప్రధాని మోదీ ముందు జేడీయూ ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై బీహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ చర్చించుకున్నారని వినికిడి.
తమకిచ్చే మంత్రి పదవులపై మోదీతో చర్చించేందుకు ఆర్సీపీ సింగ్.. ఢిల్లీకి వెళ్లారు. అయితే, క్యాబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ ఎలా చెబితే అలా నడుచుకుంటామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్కొనడం గమనార్హం.
ఇక బీహార్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)ని రెండు ముక్కలుగా చీల్చడంలో కీలకంగా వ్యవహరించిన రాం విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్కు క్యాబినెట్ బెర్త్ లభించడం ఖాయంగా కనిపిస్తున్నది. పాట్నాలో ఆయన కుర్తా కోసం షాపింగ్ చేయడం కనిపించింది.
మధ్యప్రదేశ్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ఆయన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఇక మహారాష్ట్ర, అసోం మాజీ సీఎంలు నారాయణ రాణె, సర్బానంద సోనోవాల్ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బుధవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో 22 మందికి చోటు దక్కుతుందని సమాచారం. క్యాబినెట్ విస్తరణపై హోంమంత్రి అమిత్షా, బీజేపీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్లతో ప్రధాని మోదీ రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు.
మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణెకు ఇప్పటికైతే బీజేపీ అధిష్ఠానం నుంచి కబురు రాలేదు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత రాణె మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఢిల్లీకి రావడం సహజమేనన్నారు. తనకు క్యాబినెట్లో బెర్త్ లభించేది, లేనిది తెలియదన్నారు.
సాంఘిక సాధికారత మంత్రిగా ఉన్న థావర్చంద్ గెహ్లాట్ను ఇప్పటికే కర్ణాటక గవర్నర్గా నియమించారు. ఆయన స్థానంలో జ్యోతిరాదిత్య సింధియాకు చోటు దక్కే అవకాశం ఉంది.
సింధియాతోపాటు కైలాష్ విజయ్ వర్గీయ, దినేశ్ త్రివేది, జితిన్ ప్రసాద కూడా క్యాబినెట్లో చోటు కోసం వేచి చూస్తున్నారు. థావర్ చంద్ గెహ్లాట్ స్థానంలో రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు వీరు పోటీ పడుతున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?