Delhi Metro | నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో (Delhi Metro) రైలులో మంటలు రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వైశాలి (Vaishali) ప్రాంతానికి వెళ్లే మెట్రో రైలు సోమవారం సాయంత్రం రాజీవ్ చౌక్ స్టేషన్ (Rajiv Chowk station)లో ఆగినప్పుడు రైలు కోచ్ రూఫ్పై స్వల్ప స్థాయిలో మంటలు (Fire In Train Coach) కనిపించాయి. ఇది గమనించిన ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అదికాస్తా వైరల్గా (Viral Video) మారింది.
ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. వైశాలి వైపు వెళ్తున్న మెట్రో రైలు పైభాగంలో స్వల్ప స్థాయిలో మంటలు వచ్చినట్లు తెలిపింది. ఈ ఘటన రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద సాయంత్రం 6:21 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఘటన ప్రమాదకరమైనదేమీ కాదని వివరణ ఇచ్చింది.
‘రైలు రూఫ్పై వేలాడే విద్యుత్ తీగలు, దాన్నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే పాంటోగ్రాఫ్ (ఇనుప కడ్డీల పరికరం) మధ్య ఏదైనా చిక్కుకుపోవడం జరిగినప్పుడు స్వల్ప స్థాయిలో మంటలు వస్తాయి. దీనివల్ల ఎలాంటి భద్రతా ముప్పూ గానీ, ప్రయాణికులకు ప్రాణాపాయం గానీ ఉండదు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపడతాం’ అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పష్టం చేసింది.
#WATCH | In reference to a viral video in which a minor fire is seen emanating from the roof of a train, this is to clarify that the incident pertains the to a train at Rajiv Chowk station heading towards Vaishali around 6:21 pm today: DMRC
The extant incident was the case of… pic.twitter.com/i8To6qXgha
— ANI (@ANI) May 27, 2024
Also Read..
Papua New Guinea | 2 వేల మంది సజీవ సమాధి.. ద్వీప దేశానికి భారత్ ఆర్థిక సాయం
Chiranjeevi | ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి : మెగాస్టార్ చిరంజీవి