Liquor Bottles | మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో తెలిసిందే. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. ప్రయాణికులు కూడా సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించొచ్చు. కానీ, మెట్రో ప్రయాణంలో కొన్ని వస్తువులపై నిషేధం ఉంటుంది. మద్యం, పదునైన వస్తువులు, పేలుడు పదార్థాలు, తుపాకులు వంటి వాటిని తీసుకెళ్లడం నిషేధం. అయితే, మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో శుభవార్త చెప్పింది.
ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం (Sealed Liquor Bottles) తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని డీఎమ్ఆర్ సీ స్వయంగా వెల్లడించింది. ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్ లో మద్యం బాటిళ్లను ప్రయాణికులు తీసుకెళ్లడానికి అనుమతించారా..? అంటూ మెట్రో అధికారులను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు స్పందిస్తూ.. ‘అవును, ఢిల్లీ మెట్రోలో రెండు సీలు చేసిన మద్యం సీసాలు అనుమతించబడతాయి’ అని బదులిచ్చారు.
Also Read..
Ramcharan | మెగా ప్రిన్సెస్ కు అంబానీ బంగారు ఊయల గిఫ్ట్.. స్పందించిన చరణ్ టీమ్
France | తీవ్ర ఘర్షణల నడుమ.. రోడ్డు మధ్యలో తాపీగా శాండ్ విచ్ తిన్న యువకుడు