Ramcharan | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా మెగా ప్రిన్సెస్ బారసాల శుక్రవారం మెగాస్టార్ చిరు ఇంట్లో వేడుకగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా భారత కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దంపతులు మెగా ప్రిన్సెస్ కోసం బంగారు ఊయల (Golden Cradle)ను కానుకగా పంపించారని ప్రచారం జరిగింది. అందులోనే పాప బారసాల వేడుకలు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా చరణ్ టీమ్ (Ramcharan Team) స్పందించింది. బంగారు ఊయల వార్తలు అన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రజ్వలా ఫౌండేషన్ (Prajwala Foundation) వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఊయలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
ఇటీవలే చరణ్-ఉప్సీ దంపతుల బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా చెక్క ఊయలను తయారు చేసి బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. ‘మీ (ప్రజ్వలా ఫౌండేషన్) నుంచి ఈ అద్భుత కానుకను అందుకోవడం ఎంతో గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. మీ చేతులతో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ధైర్యం, బలం, ఆత్మగౌరవం, ఆశకు ప్రతీక. మీరు పంపిన ఈ అద్భుత కానుక నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ అప్పట్లో రాసుకొచ్చింది.
Also Read..
France | తీవ్ర ఘర్షణల నడుమ.. రోడ్డు మధ్యలో తాపీగా శాండ్ విచ్ తిన్న యువకుడు