Delhi Man Suicide | వైద్య ఖర్చులు (Treatment Cost) భారం కావడంతో 24 ఏండ్ల యువకుడు బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీ (Delhi )లో చోటు చేసుకుంది. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం..
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నితేశ్ (Nitesh)కు.. వైద్య ఖర్చులు (Treatment Cost) భారంగా మారాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అతడు నార్త్ ఢిల్లీ (North Delhi)లోని ఆదర్శ్ నగర్ (Adarsh Nagar)లో ఓ హోటల్ రూమ్ (hotel room)లో ఆత్మహత్య చేసుకున్నాడు. భారీ స్థాయిలో ఆక్సిజన్ (Oxygen) పీల్చి అతడు ప్రాణాలను తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లోని ప్రాణవాయువు పైపు ద్వారా పీల్చి ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. మోతాదుకు మించి ప్రాణవాయువు పీలిస్తే గుండె కొట్టుకునే వేగం ప్రమాదకర స్థాయికి పడిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది చివరకు మరణానికి దారి తీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఆక్సిజన్ పాయిజనింగ్ (oxygen poisoning) అంటారు.
ఘటనాస్థలి వద్ద నితీశ్ రాసిన ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యం.. తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులు తనను మానసింగా కుంగదీసినట్టు యువకుడు తన లేఖలో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు వెల్లడించాడు. అయితే.. నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు అతడు ఆన్లైన్లో వెతికినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనో ఆక్సిజన్ పాయిజనింగ్ (oxygen poisoning) గురించి అతడికి తెలిసిందని వివరించారు.
Also Read..
Delhi Quake | హిందూకుష్ పర్వతాల్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్..!
Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి
India Corona | దేశంలో ఏడు వేలు దాటిన యాక్టివ్ కేసులు
Mrunal Thakur | కన్నీరు పెట్టుకున్న సీతారామం బ్యూటీ.. ఏమైందంటే..?