Satyendar Jain | న్యూఢిల్లీ, మార్చి 2: ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. తనపై కేసులు రాకుండా చేయడానికి సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు వసూలు చేశారంటూ మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణల మేరకు మంత్రిపై సీబీఐ విచారణకు ఎల్జీ ఓకే చెప్పారు.
కాగా, ఒక మోసగాడిని అడ్డుపెట్టుకుని ఎన్నికల భయంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పార్టీ పరువు తీయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆప్ ధ్వజమెత్తింది.