న్యూఢిల్లీ: పోలీసులంటే ఇప్పటి వరకు రకరకాల పేర్లతో ప్రజలను వేధించే వారని ముద్ర ఉండేది.. కానీ మానవాళిని కకావికలం చేస్తున్న కరోనా వేళ.. విధి నిర్వహణలో రక్షక భటులు ఇతరులకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. తాజాగా కరోనా రెండో వేవ్లో వెంటిలెటర్ కంటే ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఎక్కువగా ఉంది..
ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు సంబంధిత దవాఖానకు చేర్చడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. దవాఖానకు వెళ్లే మార్గాన్ని గ్రీన్ చానెల్గా మార్చేశారు.. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ ఆ దవాఖానకు చేరడంతో 235 మంది రోగుల ప్రాణాలు కాపాడారు.
పశ్చిమ్ విహార్లోని బాలాజీ యాక్షన్ దవాఖానలో ఆక్సిజన్ నిల్వలే లేవు. తమ దవాఖానకు రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తున్నాయని, 235 మంది రోగుల ప్రాణాలు ముప్పు అంచున ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ దవాఖాన సూపరింటెండెంట్.
కానీ ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ వల్ల ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్లు ఢిల్లీ సరిహద్దుల్లో నిలిచిపోయాయి. 14 వేల లీటర్లతో కూడిన ట్యాంకర్ నొయిడా, 5,500 లీటర్ల ట్యాంకర్ ఫరీదాబాద్ సరిహద్దుల్లో నిలిచిపోయాయని పోలీసుల ద్రుష్టికి తెచ్చారు ఆ సూపరిండెంటెంట్.
పోలీసు సీనియర్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. రాత్రి 11.30గంటల సమయంలో ఢిల్లీ-నొయిడా, ఢిల్లీ-ఫరీదాబాద్ సరిహద్దులకు రెండు వేర్వేరు పోలీసు టీమ్లను పంపి.. అక్కడ చిక్కుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఆక్సిజన్ ట్యాంకర్ల మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడానికి పారి చౌక్కు, బదార్పూర్ సరిహద్దులకు వేర్వేరు ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ను పంపామని పోలీసులు చెప్పారు.
ఎస్కార్ట్ పోలీసు వాహనాలు వెంట రాగా ఆక్సిజన్ ట్యాంకర్లు బాలాజీ యాక్షన్ దవాఖానకు చేరాయి. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్లు రాకపోతే 235 మంది రోగుల ప్రాణాలు రిస్క్లో పడేవని బాలాజీ యాక్షన్ దవాఖాన పేర్కొంది.
ఇందుకు సహకరించిన పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీసులకు దవాఖాన యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. అంతే కాదు పశ్చిమ విహార్ ఈస్ట్ డీసీపీ సుధాంశు ధామా. ఇతర సీనియర్ అధికారులు ఇతర దవాఖానలతో మాట్లాడి అదనపు ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించారు.
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు