న్యూఢిల్లీ: నీట్-పీజీ 2023 కటాఫ్ను జీరోకు తగ్గించడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ)ని కోర్టు ఆదేశించింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీని కూడా స్పందన తెలపాలని పేర్కొంది.
నీట్-పీజీ 2023 కటాఫ్ మార్కులను జీరోకు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ నీట్ పరీక్షకు హాజరైన ముగ్గురు వైద్యులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీట్ కటాఫ్ను సుమారు 40 మార్కుల మేర తగ్గించడం ద్వారా నీట్ పీజీ పరీక్ష ప్రమాణాలు పడిపోతాయని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు.