న్యూఢిల్లీ : ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి సత్యేందర్ జైన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం గత ఏడేండ్లలో 7 వేల తరగతి గదులను నూతనంగా నిర్మించిందన్నారు. మరి ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం 20 వేల క్లాస్ రూమ్లను కూడా ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల. దురదృష్టవశాత్తూ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇతర రాష్ట్రాల్లో ఆయన కల నెరవేరలేదు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Delhi CM Arvind Kejriwal inaugurates around 12,430 new smart classrooms in 240 government schools in the national capital.
Deputy CM-Education Minister Manish Sisodia and Delhi's Home Minister Satyendar Jain also present. pic.twitter.com/FwFjzYxeaH
— ANI (@ANI) February 19, 2022