Cab Driver | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారును దొంగలించిన దుండగులు.. ఆ కారు డ్రైవర్ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం అలానే ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు క్యాబ్ డ్రైవర్ (Cab Driver ) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వసంత్ కుంజ్ ప్రాంతం (Vasant Kunj Area)లో మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫరీదాబాద్కు చెందిన బిజేంద్ర (45) క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మహిపాల్పూర్ ప్రాంతంలో తన కారులో వెళ్తుండగా.. కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు. అతన్ని కారు నుంచి బయటకు తోసేసి కారుతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో బిజేంద్ర (Bijendra) దుండగుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు అతడిని కారుతో ఢీ కొట్టారు. అనంతరం అలానే 200 మీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
What’s happening in Delhi? #DisturbingVideo #Delhi pic.twitter.com/eTa2fG3dB0
— Navdeep Singh (@wecares4india) October 11, 2023
Also Read..
Samantha | చై-సామ్ మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారం.. హింట్ ఇచ్చిన సమంత
Divya Prabha | విమానంలో మలయాళ నటికి వేధింపులు.. మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
Mobile Phones Stolen | మ్యూజిక్ ఫెస్ట్లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్స్ చోరీ..!