భోపాల్: ఒక ఐఏఎస్ అధికారికి చెందిన పెంపుడు కుక్క అదృశ్యమైంది (Dog Missing). దీంతో దాని కోసం పలు చోట్ల పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ కుక్క ఆచూకీ తెలిపిన వారికి బహుమతి కూడా ఇస్తామని అందులో ప్రకటించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. మార్చి 31న ఆయనకు చెందిన రెండు పెంపుడు కుక్కలను సిబ్బంది ఒక కారులో ఢిల్లీ నుంచి భోపాల్కు తరలిస్తున్నారు. గ్వాలియర్ జిల్లాలోని బిలువా ప్రాంతంలోని ఒక ధాబా వద్ద సిబ్బంది కారు ఆపి భోజనం చేశారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారికి చెందిన రెండు కుక్కలు కారు నుంచి తప్పించుకున్నాయి. సిబ్బంది ఆ ప్రాంతంలో వెతికి ఒక కుక్కను పట్టుకున్నారు. అయితే రెండో కుక్క వారికి కనిపించలేదు.
కాగా, పెంపుడు కుక్క అదృశ్యంపై ఢిల్లీలో ఉన్న ఆ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసి సిబ్బంది చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో గ్వాలియర్ పోలీసులు, అక్కడి జూ సిబ్బంది ఆ కుక్క కోసం తెగ వెతికారు. అలాగే డాగ్ మిస్సింగ్పై ఆ పరిసర ప్రాంతాలతోపాటు గ్వాలియర్ జిల్లా వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. దాని ఆచూకీ గురించి చెప్పిన వారికి బహుమతి కూడా ఇస్తామని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఆ ఐఏఎస్ అధికారి మరునాడు ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్కు వచ్చారు. పెంపుడు కుక్క అదృశ్యమైన బిలువా ప్రాంతంలోని ధాబా వద్దకు పోలీసులతో కలిసి వెళ్లారు. కనిపించకుండా పోయిన తన పెంపుడు కుక్క గురించి అక్కడ ఆరా తీశారు. అలాగే ఆ ఐఏఎస్ అధికారితోపాటు పోలీసులు కూడా గత మూడు రోజులుగా ఆ మిస్సింగ్ డాగ్ కోసం గ్వాలియర్ జిల్లా వ్యాప్తంగా వెతుకుతున్నారు.
Video: Posters Put Up After Delhi Bureaucrat's Dog Goes Missing In Madhya Pradesh pic.twitter.com/1A8pzEZ1N0
— NDTV Videos (@ndtvvideos) April 3, 2023
Also Read: