చెన్నై: తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. శనివారం శంకరన్ కోవిల్లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ తమిళనాడులో హిందీని అమలు చేయాలని ప్రయత్నిస్తూ బీజేపీ తన గొయ్యిని తానే తవ్వుకొంటున్నదని ఆయన తెలిపారు. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో అమలు చేసే దమ్ముందా?’ అని ఆయన ప్రశ్నించారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలనే ప్రతిపాదనను సీబీఈఎస్ఈ ప్రవేశపెట్టింది. ఇందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లిష్ను విదేశీ భాషగా ఈ ప్రతిపాదనలో పొందుపరిచారు. తనపై ఎదురు దాడి చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను స్టాలిన్ తిప్పికొట్టారు. తమ రాష్ర్టానికి కేంద్రం విద్యా నిధులను నిలిపేసిందని ఆరోపించారు.