న్యూఢిల్లీ : ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చాలా విలువైనదిగా భావించాలని, ఆ సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇలాంటి పనుల వల్ల చిన్నారుల్లో ఏదో ఒకటి సాధించాలన్న తపన పెరుగుతుందన్నారు. విద్యార్థులు కొత్త విషయాలను అన్వేషించడానికి ప్రయత్నించాలని చెప్పారు. అయితే, పరీక్షల వేళ మీ సమయాన్ని వృథా చేసే ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
ఖాళీ సమయాన్ని క్రీడలు, సంగీతం, పెయింటింగ్ మొదలైన వాటిలో ప్రావీణ్యత పెంచుకోవడం ద్వారా భావోద్వేగాలను సానుకూల రీతిలో వ్యక్తీకరించడానికి మంచి మార్గాలుగా ఉపయోగపడతాయని చెప్పారు.
మొదట అధ్యయనం చేసేటప్పుడు కష్టమైన సబ్జెక్టులతో ప్రారంభించాలని, తరువాత తేలికైన విషయాలను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొన్ని సబ్జెక్టులను అధ్యయనం చేయడం కష్టమైన పనే అని, అయినంత మాత్రాన కష్టమైన విషయాల నుంచి పారిపోవద్దు అని ఆయన తెలిపారు.
పరీక్షా పే చర్చ కార్యక్రమం బుధవారం రాత్రి 7 గంటలకు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్లైన్లో వర్చువల్గా మాట్లాడారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ ఇది నాలుగోది. కరోనా వైరస్మహమ్మారి కారణంగా ప్రధాని మోదీ వర్చువల్ మోడ్లో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే పలువురు విద్యార్థుల ప్రశ్నలకు మోదీ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న బోర్డు పరీక్షల్లో రాణించేందుకు చిట్కాలను కూడా ప్రధాని పంచుకున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. స్వయం ప్రభా యొక్క 32 ఛానెళ్లతోపాటు దూరదర్శన్, వివిధ ప్రభుత్వ వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 14 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు.
సృజనాత్మక రచన పోటీలో 10.5 లక్షల మంది విద్యార్థులు, 2.6 లక్షల మంది ఉపాధ్యాయులు, 92,000 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల విద్యార్థులు పాల్గొనడం ఇదే మొదటిసారి.
త్వరలో పని ప్రదేశాల్లోనే కొవిడ్ టీకాలు..
కొవిడ్ తదుపరి పరిణామాలు భయంకరమైనవి : డబ్ల్యూహెచ్ఓ
కొవిడ్కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
సరిహద్దులో చొరబాటుదారు హతం.. భారీగా మందుగుండు స్వాధీనం
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాకేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..