Gang Raped | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్సులో దళిత యువతి (Dalit Woman)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Raped) ఒడిగట్టారు. ఈ ఘటన డిసెంబర్ 9-10 తేదీల మధ్య అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల దళిత యువతి ఉత్తరప్రదేశ్ నుంచి జైపూర్కు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తోంది. కాన్పూర్ నుంచి జైపూర్ వెళ్తున్న బాధితురాలు బస్సు క్యాబిన్లో కూర్చుంది. ఆ సమయంలో క్యాబిన్లో ఆరిఫ్, లలిత్ అనే ఇద్దరు డ్రైవర్లు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాకుండా డోర్ క్లోజ్ చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు.
అయితే, మహిళ వారి నుంచి బయటపడేందుకు గట్టిగా కేకలు వేయడంతో లోపలున్న ప్రయాణికులు బయటకు వచ్చారు. దీంతో లలిత్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆరిఫ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లలిత్ కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు.
Also Read..
iPhone | యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్
Mumbai Indians | రోహిత్ స్థానంలోకి పాండ్యా.. ముంబై ఇండియన్స్కి ఊహించని షాకిచ్చిన నెటిజన్స్