Gold Seized | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). మిలాన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు (Customs officials) తెలిపారు.
జమ్ము కశ్మీర్కు చెందిన 43, 45 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులు మిలాన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎయిర్పోర్ట్లో వారి లగేజీని స్కాన్ చేయగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ ఇద్దరు ప్రయాణికుల్ని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా సుమారు 10 కిలోల బంగారం పట్టుబడింది. ప్రత్యేకంగా రూపొందించిన రెండు నడుము బెల్ట్లో బంగారు నాణేలను ప్లాస్టిక్ ఎన్వలప్లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన పసిడి విలువ దాదాపు రూ.7.8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ఆ ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
The Air Intelligence Unit (AIU) of Customs, IGI Airport, New Delhi, intercepted two male passengers (aged 45, 43 years) belonging to Kashmir, arriving from Milan via Flight AI-138 on 05.02.2025. A personal search of the passengers led to the discovery of 10.092 kg of gold, valued… pic.twitter.com/8tWC0yB7na
— ANI (@ANI) February 6, 2025
Also Read..
Gold Price | ఆల్టైమ్ రికార్డుకు చేరిన బంగారం.. ఇంకా ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
Tamil Nadu | దారుణం.. బాలికపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం
Raw Papaya | పచ్చి బొప్పాయి కాయలతోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. తెలుసా..?