Karnataka | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని పోలీస్ అధికారులు తెలిపారు. పిల్లలపై కూడా నేరాలు గణనీయంగా పెరిగినట్టు చెప్పారు.
2023లో బాలలపై నేరాలు కూడా పెరిగాయి. పోలీసులు నమోదు చేసిన 631 కేసుల్లో 560 కేసులు పోక్సో (లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ) చట్టం కింద నమోదైనవే. మొత్తంగా గత ఏడాది బెంగళూరులో నేరాలు పెరిగాయి. హత్య కేసులు 205, గొలుసు దొంగతనాల కేసులు 153, దోపిడీ కేసులు 673, ఇళ్లల్లో దొంగతనాల కేసులు 1,692, మోటారు వాహనాల దొంగతనాల కేసులు 5,909 నమోదయ్యాయి.