Crime news : ఫ్రాన్స్ దేశానికి చెందిన పర్యాటకురాలికి సిటీ చూపిస్తానని చెప్పిన వ్యక్తి.. ఆమెను ఓ హోటల్లోని తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ఉదయ్పూర్ (Udaipur) సిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయ్పూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్కు చెందిన యువతి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్మిస్తున్న యాడ్ షూట్ కోసం భారత్కు వచ్చింది. ఏడాది వీసాపై గత నవంబర్ నుంచి ఆమె ఇక్కడ ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉద్యోగి సిద్ధార్థ్ ఉదయ్పూర్ సిటీ చూపిస్తానని చెప్పి యువతిని తన హోటల్ గదికి తీసుకెళ్లాడు. ఆమెపై అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
జరిగిన ఘటనపై బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సిద్ధార్థ్ కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.