CP Radhakrishnan | న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించడంపై కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు.. తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ రిలీజ్ చేసింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ఆ రిలీజ్లో తెలిపింది.
I am humbled and blessed to be given the additional responsibility to serve as the Governor of Telangana and Lieutenant Governor of Puducherry.
I thank from the bottom of my heart our beloved most respected Honourable President Smt. Droupadi Murmu Ji, our beloved most respected… pic.twitter.com/57hNukHNre— CP Radhakrishnan (@CPRGuv) March 19, 2024