CP Radhakrishnan : అధికార ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi), పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
రాధాకృష్ణన్ నామినేషన్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లాంటి అగ్రనేతలు ఆయన వెంట ఉన్నారు. కూటమిలోని కీలక నేతలంతా హాజరుకావడంతో ఈ కార్యక్రమం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే ఆయన ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.