జైపూర్ : డిసెంబర్ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. కరోనా లాంటి విపత్కరణ పరిస్థితుల్లో కాంగ్రెస్ అరాచక ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్లో కరోనా పరిస్థితిపై ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సతీష్ పునియాతో ఆయన వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా రెండో వేవ్తో అప్రమత్తంగా ఉండాలని మార్చిలోనే ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలను హెచ్చరించారని అన్నారు.
కొవిడ్కు తొమ్మిది నెలల్లోనే భారత్ రెండు స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేసిందని, వీటిని ఇప్పటికే 18 కోట్ల మందిపైగా తీసుకున్నారని గుర్తుచేశారు. అన్నిరాష్ట్రాలకు సరిపడా ఆక్సిజన్, మందులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. టూల్ కిట్ వివాదంతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. విపత్కర సమయంలో దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అసత్య ప్రచారాలతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి ధైర్యాన్ని నాశనం చేసేందుకు యత్నిస్తున్నదని జేపీ నడ్డా ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.