న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి. జన సమ్మర్థ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
గర్భిణులు, వ్యాధిగ్రస్థులు, వృద్ధులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని ప్రైవేటు దవాఖానాలకు సూచించింది. అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.