చండీగఢ్ : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చండీగఢ్ అధికారులు సోమవారం హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో 46 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత కేసులు పెరిగాయి. ఈ క్రమంలో అడ్వైజరీని జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఏం చేయాలి? ఏం చేయకూడదో చెప్పింది. మరో వైపు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా ఇంకా ముగియలేదని, తప్పనిసరిగా నియమాలను పాటించాలని, అలాగే టీకాలు పంపిణీ పెంచాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎల్లప్పుడూ పబ్లిక్ ప్లేస్లో మాస్క్లు ధరించాలని ఆదేశించారు. తుమ్మినప్పుడు, దగ్గిన సమయంలో ముక్కు, నోటికి అడ్డుగా రుమాలు, టిష్యూను అడ్డు పెట్టుకొవాలని సూచించారు.
ఇతరులతో సన్నిహితంగా ఉండడం, గుమిగూడడం నివారించాలని, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలని, చేతులను తరుచూ సబ్బు నీరు, నీటితో, హ్యాండ్ వాష్తో కడుకోవాలని అధికారులు సూచించారు. అలాగే అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దగ్గు తదితర అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. అలాగే లక్షణాలుంటే కొవిడ్ హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. అందరు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని, పిల్లలకు సైతం టీకాలు వేయించాలన్నారు. దగ్గు జ్వరంతో బాధపడితే ఎవరితోనూ సన్నిహితంగా ఉండొద్దని, చేతులతో కళ్లు, ముక్కు, నోటిని తాకొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని సూచించారు.