న్యూఢిల్లీ: మణిపూర్లో హింసను అరికట్టలేకపోయారు? బీహార్కు ప్రత్యేక హోదా ఏమైంది?..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి పాట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. లఖింసరాయ్లో ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అమిత్ షా గురువారం పాట్నాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాట్నాలో అమిత్ షాకు వ్యతిరేకంగా ఇన్కమ్ట్యాక్స్ గోలాంబర్ వద్ద పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన, మణిపూర్లో హింస, ఈడీ, సీబీఐ..కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేయటం.. పలు అంశాల్ని ప్రస్తావిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేయటం చర్చనీయాంశమైంది. బీహార్ పర్యటనలో షా ముందుగా వీటికి సమాధానం చెప్పాలి? అని అర్థం వచ్చేట్టు వీటిని ఏర్పాటుచేశారు.