జవహర్నగర్: జవహర్నగర్ డంపింగ్ యార్డు ఎత్తేసే వరకు పోరాడుదామని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్యార్డ్డు ఎత్తివేత కోసం జరిగే అవగాహన సదస్సును పురస్కరించుకొని జవహర్నగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ, మాజీ మేయర్ మేకల కావ్య, కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డు ఎత్తివేయాలని కోరుతూ.. కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్గౌడ్, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.