Cotton Candy | చెన్నై, ఫిబ్రవరి 17: సైకిళ్లపై పొడవాటి కర్రకు గులాబీ రంగులో తళతళ మెరిసిపోతూ ప్లాస్టిక్ కవర్లలో దండలా వేలాడే పీచు మిఠాయి అంటే తెలియనివారు చాలా తక్కుమంది ఉంటారు. ఇంత పాపులర్ స్వీట్పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. పీచు మిఠాయిలో రంగుల కోసం ప్రమాదకర రోడమైన్-బీ అనే రసాయనాన్ని కలుపుతున్నట్టు తేలటంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొన్నది.
రోడమైన్-బీ అనే రసాయనాన్ని దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్లో వాడతారు. ఇది ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుంది.