పుణె: మహారాష్ట్రలో బీజేపీ కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుణె జిల్లాలోని తన నివాసంలో లైసెన్స్డ్ రివాల్వర్తో తలలో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరుణ చించ్వాడే అనే మహిళ పుణె జిల్లా పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్. ఆదివారం రాత్రి కార్పొరేటర్ కరుణ చించ్వాడే కుటుంబసభ్యులతో కలిసి డిన్నర్ చేసిన తర్వాత ఆమె కుమారుడు ప్రసన్న శేఖర్ చించ్వాడే (21) ఇంటి పైఫ్లోర్లోకి వెళ్లాడు.
ఇతర కుటుంబసభ్యులు కింది ఫ్లోర్లోనే మాట్లాడుతూ కూర్చున్నారు. ఇంతలో పైఫ్లోర్ నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో అందరూ పైకి పరుగులు తీశారు. అప్పటికే ప్రసన్న శేఖర్ రక్తపు మడుగులో పడివున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మున్సిపల్ ఆఫీస్పై ఉగ్రవాదుల కాల్పులు.. గన్మ్యాన్, కౌన్సిలర్ దుర్మరణం
ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?