మద్రాస్: మద్రాస్ ఐఐటీలో (Madras IIT) కరోనా కలకలం కొనసాగుతున్నది. కొత్తగా మరో 25 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీలో కరోనా బాధితుల సంఖ్య 55కు చేరిందని తమిళనాడు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ చెప్పారు. ఇప్పటివరకు 1420 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 55 మంది పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం క్యాంపస్లో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో ఐసోలైషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో భహిరంగప్రదేశాల్లో మాస్క్ ధరనించడాన్ని తప్పనిసరి చేశామన్నారు. తామెప్పుడూ మాస్క్ తప్పనిసరి నిబంధనను ఉపసంహరించుకోలేదని, ఫైన్ వేయడాన్ని మాత్రమే తగ్గించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 93 శాతం మంది కరోనా డోస్ మొదటి డోస్ వేసుకున్నారని, 77 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు.