శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముష్కరులు దాడిచేశారు. ఇంట్లో ఉన్న అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడని అధికారులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం లేత్పొరాలో ఐఆర్పీ 23వ బెటాలియన్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడినవారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.