లక్నో: రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు ఆమెను వెనక్కి వెళ్లాలని సూచించాడు. ఇవేమీ పట్టించుకోని ఆమె పట్టాలు దాటుతున్నది. ఇంతలో ఆమె దగ్గరికి రైలు రానేవచ్చింది. వెంటనే ప్లాట్ఫామ్ చివరికి పరుగెత్తిన ఆ కానిస్టేబుల్ ఆమెను పైకి గుంజేశాడు. రెప్పపాటులోనే రైలు వాళ్లను దాటుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) లలిత్పూర్ రైల్వే స్టేషన్లో జరిగింది.
ప్లాట్ఫామ్పై ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డయింది. ఈ వీడియోను రైల్వే అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధురాలిని కాపాడిన పోలీసును అభినందించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించుకోవాలని, పట్టాలు ఎట్టిపరిస్థితుల్లో దాటొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు 69 వేల మందికిపైగా దీనిని వీక్షించారు.
आरपीएफ कर्मी की सतर्कता और तत्परता से बचाई गई महिला की जान!
झांसी मंडल के ललितपुर स्टेशन पर पटरी पार कर रही एक बुजुर्ग महिला को वहां तैनात रेलवे सुरक्षाकर्मी ने अपनी जान पर खेलकर बचाया।
सभी से अनुरोध है कि एक से दूसरे प्लेटफॉर्म पर जाने के लिए फुट ओवर ब्रिज का उपयोग करें। pic.twitter.com/HZUCEXvbjs
— Ministry of Railways (@RailMinIndia) June 18, 2022