Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్కు తీవ్ర గాయాలైనట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
మంగళవారం సాయంత్రం సమయంలో ప్లాటూన్ కమాండర్ రామ్ ప్రసాద్ (50) (Ram Prasad) తన తుపాకీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఫైర్ అయ్యిందని చెప్పారు. దీంతో రామ్ ప్రసాద్కు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వెంటనే అతడిని చికిత్స కోసం అయోధ్య మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.
కాగా, యూపీలోని అమేథీ జిల్లా అచల్పూర్ గ్రామానికి చెందిన రామ్ ప్రసాద్ గత ఆరు నెలలుగా రామజన్మభూమి ప్రాంగణంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్టు అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Ram Charan | తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు.. క్లీంకారా ఫేస్ రివీల్
Enforcement Directorate: వాషింగ్ మెషీన్లో కరెన్సీ కట్టలు.. 2.5 కోట్లు సీజ్ చేసిన ఈడీ
Solar Storm | భూమిని తాకిన బలమైన సౌర తుఫాన్.. భూ అయస్కాంత క్షేత్రంలో అవరోధాలు..!