న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( Enforcement Directorate) అధికారులు వేర్వేరు నగరాల్లో సోదాలు నిర్వహించారు. సుమారు 2.54 కోట్ల నగదును వాళ్లు సీజ్ చేశారు. అయితే ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్లో కూడా సొమ్ము దాచుకున్నారు. ఆ మెషీన్ నుంచి నోట్ల కట్టలను ఈడీ వెలికి తీసింది. ఫెమా ఉల్లంఘనల కేసులో ఈడీ సోదాలు చేసింది. కాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, లాక్స్మిటాన్ మారిటైం, హిందుస్తాన్ ఇంటర్నేషనల్, రాజ్నందిని మెటల్స్, స్టావార్ట్ అలాయ్స్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక స్టీల్స్, వశిష్ట కన్స్ట్రక్షన్స్ కంపెనీలు, వాటి డైరక్టర్ల ఇండ్లల్లో సోదాలు జరిగాయి. విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్ గార్డ్, వినోద్ కేడియా లాంటి డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, కురుక్షేత్ర, హర్యానా రాష్ట్రాల్లో ఆ సోదాలు చేపడుతున్నారు. అయితే వాషింగ్ మెషీన్లో ఉన్న క్యాష్ను ఎక్కడ రికవరీ చేశారన్న విషయాన్ని మాత్రం ఈడీ వెల్లడించలేదు. భారీ మొత్తంలో సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ సోదాలు చేపట్టింది. సింగపూర్కు చెందిన గెలాక్సీ షిప్పింగ్ కంపెనీకి సుమారు 1800 కోట్లు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీ నుంచి ఆ డబ్బును విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. అంథోనీ డిసిల్వా అనే వ్యక్తి ఆ కంపెనీ నడుపుతున్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తం లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు. నేహ మెటల్స్, అమిత్ స్టీల్ ట్రేడర్స్, ట్రిపుల్ మెటల్, హెచ్ఎంఎస్ మెటల్స్ లాంటి కంపెనీలు నుంచి ఆ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.
ED conducted searches under the provisions of FEMA,1999 at the premises of Capricornian Shipping & Logistics Pvt Ltd and its directors Vijay Kumar Shukla and Sanjay Goswami and associated entities. Laxmiton Maritime, Hindustan International, Rajnandini Metals Limited, Stawart… pic.twitter.com/mgyz8datcp
— ANI (@ANI) March 27, 2024