జబువా/టంకార : కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి అని, వారికి ఎన్నికలప్పుడే గ్రామాలు, రైతులు, పేదలు గుర్తుకు వస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో ఆదివారం గిరిజనులతో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ మరోవైపు ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా గుజరాత్లోని ఆయన జన్మస్థలం టంకారాలో ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకల్లో మోదీ వర్చువల్గా ప్రసంగించారు.
ప్రజలు బానిసత్వం, మూఢ నమ్మకాలతో మగ్గుతున్న స్థితిలో భారతీయ సమాజం తిరిగి వేదాలను ఆశ్రయించాలని పిలుపునిచ్చిన మహనీయుడు స్వామి దయానంద సరస్వతి అని ప్రశంసించారు.