న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కర్నాల్లో ఆందోళన చేపట్టిన రైతులపై బీజేపీ సారధ్యంలోని హర్యానా ప్రభుత్వం లాఠీచార్జికి పాల్పడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. రైతులపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. రైతులపై దౌర్జన్యంతో దేశం సిగ్గుతో తలదించుకుంటోదని వ్యాఖ్యానించింది.
మరోసారి రైతుల రక్తం చింది దేశం సిగ్గుతో తలదించుకుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ రక్తంతో తడిసిన రైతుల దుస్తుల ఫోటోను ట్వీట్ చేశారు. కర్నాల్కు వెళుతూ హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని హర్యానా పోలీసులు శనివారం జరిపిన లాఠీచార్జిలో దాదాపు పది మంది రైతులు గాయపడ్డారు. రైతులపై పోలీసుల దాడిని కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ఖండించారు. హర్యానా కాంగ్రెస్ సర్కార్ను జనరల్ డయ్యర్ ప్రభుత్వంగా అభివర్ణించారు.