BJP Manifesto : లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో 14 అంశాలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ప్రధాని మోదీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశామన్నారు. యువశక్తి, నారీ శక్తి, గరీబ్, కిసాన్ను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేశామన్ని తెలిపారు. కాషాయ పార్టీ మేనిఫెస్టో లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ అంశాలను బీజేపీ మేనిఫెస్టో ప్రతిబింబించలేదని దుయ్యబట్టింది. బీజేపీ మేనిఫెస్టో మోసపూరితమైనదని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె విమర్శించారు. రైతులకు ఆ పార్టీ గతంలో వాగ్ధానం చేసిన కనీస మద్దతు ధర గురించి బీజేపీ మేనిఫెస్టోలో ప్రస్తావించలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరచలేదని విమర్శించలేరు.
Read More :
Vastu Shastra | చెరువును ఆనుకొని ఉన్న ఊర్లు బాగుండవు అంటారు.. అది నిజమేనా?