ఉదయ్పూర్, మే 15: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇప్పటికైనా కండ్లు తెరిచారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని స్వయంగా ఆయనే చెప్పారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్కు, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రజల వద్దకు మనం వెళ్లాలి. ఇందుకోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించాం’ అని తెలిపారు.