న్యూఢిల్లీ, మార్చి 29: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా అవినీతి శక్తులన్నీ ఏకం అయ్యాయని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కూటమికి మోదీనే కన్వీనర్ అని విమర్శించారు.
“అదానీ షెల్ కంపెనీలో 20 వేల కోట్లు ఎవరివి? లలిత్ మోదీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి, విజయ్మాల్యా, జతిన్ మెహతా.. ఇలా వీళ్లంతా మీ ‘అవినీతి రహిత దేశం’ ప్రచారంలో భాగమా? మరి మీరేనా ఈ కూటమికి కన్వీనర్?” అని ఎద్దేవా చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటకుడిగా మీకు మీరు చెప్పుకోవడం మానుకోవాలన్నారు. జేడీయూ, శివసేన(జేడీయూ) వంటి పార్టీలు మీ సంకీర్ణం నుంచి పక్కకు పోగానే అవినీతి పార్టీలు అయిపోయాయా? అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.