Mallikarjun Kharge | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై.. లోక్సభ సెక్రటేరియట్ (Loksabha Secretariat) అనర్హత వేటు విధించారు. లోక్సభ నుంచి ఆయన్ను డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాహుల్ లోక్సభ సభ్యత్వం(Loksabha Membership) రద్దు అయ్యింది. మార్చి 23వ తేదీ నుంచి అనర్హత వేటు(Disqualified) అమలులోకి వస్తుందని లోక్సభ సెక్రటేరియట్ తెలిపారు. కాగా, రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఏఐసీసీ (AICC) చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. బీజేపీ (BJP)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. వారు (బీజేపీని ఉద్దేశిస్తూ) నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరినీ సభ నుంచి గెంటేస్తారు. కానీ, మేము నిజాలు మాట్లాడుతూనే ఉంటాం. హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బెదిరింపులకు భయపడము.. మౌనంగా ఉండము. మా డిమాండ్లు కొనసాగిస్తూనే ఉంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని’ అని ఖర్గే (Mallikarjun Kharge) స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే ముద్ర చాలా దారుణం అని ఖర్గే అన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ.. వీళ్లంతా బలహీన వర్గాల వారా..? అని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ అంశంలో న్యాయపరంగా, రాజకీయంగా ముందుకెళ్తామని చెప్పారు.
ప్రధాని మోదీ (Pm Modi) ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటక (Karnataka)లో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..?’ ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కోర్టుకు వెళ్లింది. రాహుల్పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో గురువారం విచారణ జరిపిన సూరత్ కోర్టు (Surat Court) రాహుల్ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రెండేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలోనే నిబంధనల ప్రకారం.. లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు విధించారు.
నేర నిరూపణ రుజువైతే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. పార్లమెంట్ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేండ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే తీర్పు వచ్చిన క్షణం నుంచి వారు ఆ పదవికి అనర్హులవుతారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆరేండ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తారు.
Also Read..
Opposition MPs: డెమోక్రసీ ఇన్ డేంజర్.. రాష్ట్రపతిభవన్కు విపక్షాల మార్చ్
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్సభ సభ్యత్వం రద్దు
Rahul Gandhi | కోర్టు తీర్పు తర్వాత పార్లమెంట్ సమావేశాలకు హాజరైన రాహుల్