న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై.. లోక్సభ సెక్రటేరియేట్(Loksabha Secretariat) అనర్హత వేటు విధించారు. లోక్సభ నుంచి ఆయన్ను డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం(Loksabha Membership) రద్దు అయ్యింది. మార్చి 23వ తేదీ నుంచి అనర్హత వేటు(Disqualified) అమలులోకి వస్తుందని లోక్సభ సెక్రటేరియేట్ తెలిపారు. ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేరళలోని వయనాడ్(Wayanad) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీపై వేటు పడింది. నేరపూరిత పరువునష్టం(criminal defamation) కేసులో దోషిగా తేలినందు వల్లే రాహుల్కు అనర్హత తప్పలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు లోక్సభ సెక్రటేరియేట్ తన లేఖలో తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.
లోక్సభ సెక్రటేరియేట్ ఇచ్చిన నోటిఫికేషన్పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో తప్పుడు నిర్ణయమని మనీశ్ తివారి అన్నారు. ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించే అధికారం లోక్సభ సెక్రటేరియేట్కు లేదన్నారు. రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకోవాలని, అది కూడా ఎన్నికల సంఘంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు.