Today History: ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) గా చెప్పుకుంటున్న పార్టీ ఒక ఆంగ్లేయుడి చేతిలో 136 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్నది. ఇదే మన దేశంలోని అతి పురాతనమైన పార్టీగా వినుతికెక్కింది. ఈ పార్టీని స్కాటిష్ రిటైర్డ్ అధికారి అయిన అల్లన్ ఓక్టివాన్ హ్యూమ్ (ఏఓ హ్యూమ్) 1885 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. తన జీవితకాలంలో పార్టీ వ్యవస్థాపకుడనే హోదాను ఆయన పొందలేదు. అయితే, 1912 లో ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రకటించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో 1.5 కోట్ల సభ్యత్వం.. 7 కోట్ల మంది మద్దతుదారులను కలిగి ఉన్నది.
ఆంగ్లేయులు ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించే కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నది. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటీష్ వారు అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని కోరుకుని విద్యావంతులైన భారతీయుల్లో ప్రభుత్వం పట్టును పెంచడంపై దృష్టిసారించారు. తద్వారా బ్రిటిష్ రాజ్, పౌర, రాజకీయ సమస్యలు వారి మధ్య చర్చికు వచ్చాయి. ఇందుకోసం ఆంగ్లేయ అధికారి ఏఓ హ్యూమ్ను ఎంపిక చేశారు. ఇండియా చేరుకున్న హ్యూమ్.. తొలుత కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. తొలి అధ్యక్షుడిగా కోల్కతా హైకోర్టు బారిస్టర్ వ్యోమేష్ చంద్ర బెనర్జీ బాధ్యతలు చేపట్టారు. పార్టీ తొలి సమావేశం కలరా కారణంగా పుణె నుంచి వేదికను బొంబాయికి మార్చారు.
1905లో బెంగాల్ విభజనతో కాంగ్రెస్కు కొత్త గుర్తింపు వచ్చింది. విభజనను బహిరంగంగా వ్యతిరేకించి.. ఆంగ్లేయుల వస్తువులను బహిష్కరించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ రెండుగా విడిపోయింది. మితవాదుల ఒక పార్టీగా, అతివాదులు మరో పార్టీగా ఏర్పడ్డారు. 1915 లో కరమ్చంద్ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చాడు. అయితే, 1919 లో స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. గాంధీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ ఉద్యమం నడిపింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా కొనసాగి.. చివరకు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేలా చేసింది.
స్వాతంత్య్రం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు వ్యక్తులు దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. వీరిలో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ఉన్నారు. 136 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు 80 మందికి పైగా అధ్యక్షులు కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 73 ఏండ్ల కాలంలో 38 ఏండ్ల పాటు నెహ్రూ-గాంధీ కుటుంబం పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. కాగా, నెహ్రూ-గాంధీయేతర కుటుంబం 35 ఏండ్ల పాటు అధికారం చేపట్టింది.
2013: ఢిల్లీలో మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
2008: కవి, సాహితీవేత్త ప్రొఫెసర్ సురేష్ వాత్స్యాయన్ మరణం
1995: ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద జెండా ఎగురవేసిన మొదటి వ్యక్తిగా నిలిచిన అన్వేషకుడు మార్కే కర్మిస్కీ
1928: మొదటి టాకీ చిత్రం ‘మెలోడీ ఆఫ్ లవ్’ కోల్కతాలో ప్రదర్శన
1926: భారతదేశం-ఇంగ్లండ్ మధ్య ప్రయాణికులు, పోస్టల్ సేవలను ప్రారంభించిన ఇంపీరియల్ ఎయిర్వేస్
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..