శ్రీనగర్, ఏప్రిల్ 8: జమ్ముకశ్మీర్, లఢక్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఈ మేరకు సోమవారం రెండు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు. అనంత్నాగ్, శ్రీనగర్, బారాముల్లా లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్సీ పోటీ చేయనుండగా.. ఉదంపూర్, జమ్ము, లఢక్ స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనున్నది. అయితే విపక్ష ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మరో పార్టీ పీడీపీ వేరుగా పోటీ చేస్తున్నది.