Manish Tewari : కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ బీజేపీలో చేరుతారనే ప్రచారంపై ఎంపీ కార్యాలయం ఆదివారం స్పందించింది. ఈ వార్తలు నిరాధారమని తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఎంపీ బీజేపీతో టచ్లో ఉన్నారని, కమలం గుర్తుపై ఆయన పంజాబ్లోని లుథియానా నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకోవడంతో ఎంపీ కార్యాలయం ఈ వివరణ ఇచ్చింది.
మనీష్ తివారీ తన నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ఆయన కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. గత రాత్రి ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో బస చేశారని తెలిపింది. మనీష్ తివారీ ప్రస్తుతం పంజాబ్లోని ఆనంద్సాహిబ్ పూర్ స్ధానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరతారనే ఊహాగానాల నడుమ మనీష్ తివారీ పేరు కూడా వినిపించింది. అయితే కమల్ నాథ్ కాషాయ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, ఆయన బీజేపీలో చేరతారని కలలో కూడా ఊహించరని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారి పేర్కొన్నారు. అయితే కమల్ నాథ్కు రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.
Read More :