పాట్నా, నవంబర్ 2: కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ర్టాల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ఇండియా కూటమి బలోపేతంపై లేదని బీహార్ సీఎం నితీశ్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన పాట్నాలో జరిగిన సీపీఐ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాడటానికి తామంతా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. కానీ మొదట ఉన్న ఊపు తర్వాత లేకుండా పోయిందని, దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. కూటమి బలోపేతాన్ని వదిలేసిన కాంగ్రెస్ ఐదు రాష్ర్టాల ఎన్నికల కోసమే పాకులాడుతున్నదని మండిపడ్డారు.