న్యూఢిల్లీ : ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను ప్రయోగిస్తే తాము భయపడమని మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనటె (Congress) మండిపడ్డారు. పోలీసులు అసమర్ధులుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆమె దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ నేపధ్యంలో సుప్రియా శ్రీనటె ఈ వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ, ఈడీలు ఎన్నడూ బీజేపీ నేతలను విచారించలేదనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. బీజేపీకి చెందిన నేతల కేసుల్లో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు నోరు మెదపడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు దర్యాప్తు ఏజెన్సీలు సమన్లు జారీ చేసినప్పడు ఆప్ నేతలు కూడా మౌనం దాల్చారని పేర్కొన్నారు.
కానీ తాము ఆప్ నేతల్లా వ్యవహరించబోమని అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సిసోడియాను ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తమ ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడంతో పాటు విచారణకు సహకరించనందున సిసోడియాను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read More :