Manish Sisodia- Satyendar Jain | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సిసోడియాకు సూచిస్తూ.. పిటిషన్ను తిరస్కరించింది. మరో వైపు సిసోడియాతో పాటు సత్యేందర్ జైన్ (Satyendar Jain) సైతం రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మనీలాండింగ్ కేసులో జైలులో ఉన్నారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind kejriwal) ఆమోదించారు.