భోపాల్: ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన ఓ మహిళా నేతను పోలీసులు 10 గంటలపాటు నిర్భందించారు. శనివారం ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) భోపాల్లో (Bhopal) పర్యటించారు. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను (Vande Bharat Express) ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అధికార ప్రతినిధి సంగీతా శర్మను (Sangeeta Sharma) బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. 10 గంటల పాటు ఆమెను స్టేషన్లోనే ఉంచారు. ప్రధాని ముందు సంగీతా శర్మ నిరసరన తెలుపనుందనే సమాచారంతోనే ఆమెను అరెస్టు చేశామని, పీఎం పర్యటన పూర్తయిన తర్వాత విడుదల చేశామని పోలీసులు తెలిపారు.
కాగా, ఉదయం 8 గంటలకు తన ఇంటికి వచ్చిన పోలీసులు.. తనను బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకు తీసుకెళ్లారని సంగీతా చెప్పారు. తాను చేసిన నేరమేంటని అడిగితే చెప్పలేదని, తనను ఎవ్వరితో మాట్లాడనివ్వలేదని, పోన్ కూడా తీసుకున్నారని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్నాథ్ పంపిన వ్యక్తులను కూడా తననకు కలువకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మొత్తం 10 గంటలపాటు స్టేషన్లోనే ఓపక్కకు కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
मध्य प्रदेश कांग्रेस मीडिया विभाग की उपाध्यक्ष संगीता शर्मा के घर पुलिस पहुँची। गिरफ़्तार करने की तैयारी। प्रधानमंत्री के भोपाल दौरे के समय हुई कार्रवाई। पुलिस ने कार्रवाई की वजह नहीं बताई।
शर्म करो शिवराज जी, एक महिला मोर्निंग वॉक पर जाती है और आप आपकी कुर्सी हिलने लगती है। pic.twitter.com/dlSaeyQyff
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) April 1, 2023